రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. షబ్బీర్ అలీ, విశ్వేశ్వర్ రెడ్డి సహా పలు కీలక నేతలను ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. ఇటు పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.