శృతి మళ్లీ గయాబ్


హీరోయిన్ శృతిహాసన్ ఆ మధ్య కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. సినిమాలపై ధ్యాసని వదిలేసి… ప్రియుడు, ప్రేమ అంటూ తిరిగేసింది. అదేసమయంలో పలు సంగీత కచేరీలు చేసింది అనుకోకుండా. ప్రియుడుతో బ్రేకప్ తర్వాత మాత్రం మళ్లీ సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేసింది. మరోసారి హీరోయిన్ గా బిజీకావాలనే కసి చూపించింది.
ఆ ప్రయత్నాలు ఫలించి రవితేజ 'క్రాక్‌' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత క్రాక్ సినిమా సినిమాలు కానుంది. ఇందుకు సమయం ఉండటంతో శృతిమరోసారి విదేశాలకి చెక్కేసింది. ఈ సారి కూడా ఆమె సంగీత కచేరిల కోసమే వెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగొచ్చాక క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది. గతంలో రవితేజ-శృతిహాసన్ కాంబోలో వచ్చిన బలుపు సినిమా మంచి వినోదాన్ని పంచింది. ఈసారి ఈ జంట థ్రిల్ చేయబోతున్నట్టు సమాచారమ్.