TDP కొత్త ఆఫీస్ కు చిక్కులు.... హైకోర్ట్ నోటీసిలు...  కూల్చేయాల్సిoదేనా!

డిసెంబర్ 6న మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అదే రోజు మంగళగిరి ఎమ్మెలయే ఆర్కే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయ భనం అక్రమ నిర్మాణమని.. భవనాన్ని కూల్చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో కోరారు.

మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని.. టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 99 ఏళ్ల పాటూ లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు. ఆ జీవో నిబంధనలకు విరుద్ధమని.. చంద్రబాబు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌‌లను ప్రతివాదులుగా చేర్చారు.


ఆర్కే తన పిటిషన్‌లో పర్యావరణ చట్టాల ప్రకారం.. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని ప్రస్తావించారు. అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కోర్టుకు వివరించారు. చట్టాలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయ నిర్మాణం చేశారని.. కాబిట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి.. ఆ భవనాన్ని కూల్చివేయాలని కోరారు. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.