హైదరాబాద్‌లో 2014 మార్చి 1న 8 సెంటర్లతో నాంపల్లిలో  ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన్నారు. ఈ పథకం అమలు పరిచి  ఆరేండ్లు పూర్తయింది. ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. హరేకృష్ణ మూమెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పథకం ఇప్పుడు 150 కేంద్రాలకు విస్తరించింది. అన్నపూర్ణ రూ.5లకే భోజనం పథకం ప్రారంభంచి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా అమీర్‌పేటలో అన్నపూర్ణ భోజన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి అరవింద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మొబైల్‌ అన్నపూర్ణ పథకాన్ని జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది.