కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా... వారి సంస్కృతి, అలవాట్ల పై కూడా చూపిస్తోంది. ఓ వ్యక్తి కరోనా భయంతో ముఖానికి మాస్క్ ధరించి ఉంటారు. అంతలో ఆయన స్నేహితులలో ఒకరు అతని వద్దకు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వబోతారు. కానీ, ఒక్క క్షణం ఆగి.. పునరాలోచనలో పడతారు. వారికి వచ్చిన ఓ కొత్త ఆలోచన ప్రకారం... కాలు కదుపుతూ 'లెగ్షేక్' ద్వారా గ్రీట్ చేసుకొన్నారు. అనంతరం ఆ స్నేహితుడు తన దారిన తాను వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ వ్యక్తి మిగిలిన స్నేహితులను అదే 'స్టైల్'లో పలకరించాడు.కరోనా వ్యాప్తించకుండా లెగ్షేక్ ఇచ్చుకోవాలనే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది అద్భుతమైన ఆలోచన అని...అసలు కరోనా సద్దుమణిగిన తరువాత కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోవడం బెటరని కామెంట్లు చేస్తున్నారు..!
0 Comments